News April 4, 2024

ఖమ్మంలో భారీగా పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింటా రూ.20,000 ధర పలకగా పత్తి జెండా పాట క్వింటా రూ.7300 పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర నిన్నటి కంటే 100 రూపాయలు తగ్గగా మిర్చి ధర 1,300 పెరిగింది.

Similar News

News April 25, 2025

తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శం: మంత్రి తుమ్మల

image

తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన పథకాలు అర్హులకు దక్కడం లేదని, అందుకే కులగణన జరిపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ సమానమైన హోదాలో ఉండాలని కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 14 నెలల్లో చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయలేదన్నారు.

News April 25, 2025

ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

image

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.

News April 25, 2025

ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

image

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

error: Content is protected !!