News January 18, 2025
ఖమ్మంలో విషాదం.. చెరువులో దంపతుల మృతదేహాలు లభ్యం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 11, 2025
ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.
News February 11, 2025
కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
రఘునాథపాలెం: పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

ప్రజలకు ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్ను సందర్శించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.