News March 18, 2025

ఖమ్మం: అండర్ పాస్‌కు రైల్వే మంత్రి హామీ

image

ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం పై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు.

Similar News

News March 19, 2025

ఖమ్మం: ఓటు నమోదుకు 4,734 దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లాలో ఫారం 6 క్రింద 4,734 దరఖాస్తులు రాగా, 3,267 నూతన ఓటర్లను నమోదు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో 943 దరఖాస్తులు తిరస్కరించామని, 550 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో 1,459 పోలింగ్ కేంద్రాలకు గాను ఈవీఎం గోడౌన్‌లో 5,824 బ్యాలెట్ యూనిట్లు, 2,202 కంట్రోల్ యూనిట్‌లు, 2,218 వివి ప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News March 19, 2025

ఖమ్మం: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. TGOBMMSNEW.CGG.GOV.IN వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఉప డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు.

News March 18, 2025

కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

image

జడ్చర్ల మండలంలో <<15786400>>నవవధువు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్తమామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

error: Content is protected !!