News June 28, 2024
ఖమ్మం: అగ్గిపెట్టె లేదన్నందుకు దాడి.. కేసు నమోదు

అగ్గిపెట్టె లేదని చెప్పినందుకు ఓ వ్యక్తిపై నలుగురు దాడికి పాల్పడ్డారు. కారేపల్లికి చెందిన సిద్దంశెట్టి నాగేశ్వరరావు తన ట్రాక్టర్లో డీజిల్ కొట్టించేందుకు బుధవారం రాత్రి సమీపంలోని బంక్కి వెళ్లాడు. అక్కడకు బైకులపై చేరుకున్న ఖమ్మం యువకులు రోహిత్, సాయి, అభి, యశ్వంత్ అగ్గిపెట్టె అడిగారు. తన వద్ద లేదని చెప్పడంతో దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 15, 2025
రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు: ఖమ్మం CP

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. పోలీసుల సేవలు, త్యాగాలు, కీర్తి ప్రతిష్ఠలను ప్రతిబింబించే అంశాలపై ఫోటోలు, షార్ట్ ఫిల్మ్లను ఈ నెల 22వ తేదీలోపు పీఆర్వో నంబర్ 87126 59256కు పంపాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
News October 15, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్లతో అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని ఆదేశించారు.
News October 15, 2025
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.