News May 25, 2024

ఖమ్మం: అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు!

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీష్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీష్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

Similar News

News February 19, 2025

ఖమ్మం: వాహనం ఢీకొని యువకుడు మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News February 19, 2025

ఖమ్మం: డ్రాగన్, పామాయిల్ తోటలను పరిశీలించిన కలెక్టర్

image

సింగరేణి మండలం చీమలపాడు డ్రాగన్ మరియు పామాయిల్ తోటలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. రైతు వెంకటేశ్వర్లు పొలం గట్టు పై కూర్చొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రాగన్ పంటలోఆదాయం, పామాయిల్ పంట వలన వచ్చే ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి ఇతర రైతులు పాల్గొన్నారు.

News February 18, 2025

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు.

error: Content is protected !!