News July 29, 2024

ఖమ్మం: ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి

image

ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బొడ్డుపల్లి గౌతమ్ ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్‌లో జరిగే అండర్-17 పోటీలకు వెళ్లేందుకు తన వద్ద అంత స్తోమత (నగదు) లేదని విద్యార్థి గౌతమ్ తెలిపారు. ఎవరైనా స్పందించి తాను నేపాల్‌లో జరిగే అండర్ 17 కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు సహాయం చేయాలని కోరాడు.

Similar News

News October 19, 2025

ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్‌లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్‌లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.

News October 19, 2025

ఖమ్మం: సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

image

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 5 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5లోగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.

News October 18, 2025

డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

image

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.