News March 12, 2025
ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మూల్యాంకనం నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో చురుగ్గా సాగుతోంది.మొదటి రోజు మొత్తం 24 మంది అధ్యాపకులకు 15 మంది హాజరై ఒక్కొక్కరు 30 పేపర్ల చొప్పున 450 సంస్కృతం సంస్కృతం మూల్యాంకనం నిర్వహించారు. మంగళవారం 24 మంది అధ్యాపకులకు 19 మంది హాజరై ఒక్కొ క్కరు 30 పేపర్ల చొప్పున 570 పేపర్లను మూల్యాంకనం చేయగా మొత్తం 1,020 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు.
Similar News
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 17, 2025
ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.
News December 17, 2025
ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


