News June 11, 2024
ఖమ్మం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డుల కోసం 35వేలు, కార్డుల్లో మార్పునకు 25,901 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 4,11,347 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 11,32,871గా ఉంది.
Similar News
News October 16, 2025
ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 16, 2025
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం: సీపీ

ఫ్లాగ్ డేను పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు, 3 ని.లు గల షార్ట్ ఫిలిమ్స్ తీయాలని చెప్పారు. ఈనెల 22లోపు పోలీస్ కమిషనరేట్లో షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, ఫొటోలు అందజేయాలన్నారు.
News October 16, 2025
రోడ్ల మరమ్మతుల వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

జిల్లాలో రోడ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ, జాతీయ రహదారుల అధికారులతో సమీక్షలో మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల గుంతలు, మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ప్రవేశ, నగర ప్రవేశాల సుందరీకరణ, నేమ్ బోర్డులు, విద్యుత్ స్తంభాల తరలింపును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.