News March 25, 2025
ఖమ్మం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాచేపల్లికి చెందిన D.హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 రోజులుగా ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 29, 2025
‘పది’ జవాబు పత్రాలు సురక్షితంగా ఉన్నాయి: ఖమ్మం DEO

కారేపల్లి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో నిర్వహించిన SSC మార్చి-2025కు సంబంధిన భౌతిక, రసాయన శాస్త్రం జవాబు పత్రాలను తపాలా శాఖ వారు తరలిస్తుండగా జారి కింద పడడం జరిగింది. కాగా ఆ పరీక్ష జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
News March 29, 2025
KMM: ఫ్యాన్కు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక మసీదు రోడ్డుకు చెందిన షేక్ ఆలీబాబా అలియాస్ బన్ను(24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2025
ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం V. వెంకటాయపాలెం గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.