News February 27, 2025
ఖమ్మం: ఊటీని తలదన్నేలా.. వెలుగుమట్ల అర్బన్ పార్కు

కనుచూపు మేరంతా పచ్చదనం, ఆకాశ హర్య్మాలతో కనువిందు చేస్తుంది వెలుగుమట్ల అర్బన్ పార్కు. ప్రకృతి అందాలు ఓ వైపు.. పర్యాటక శోభ మరో వైపుతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పార్కు అందాలను ఖమ్మం వాసులే కాకుండా చుట్టు పక్కల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. 440 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో 30 ఎకరాల్లో పర్యాటకాన్ని వృద్ధి చేస్తున్నారు.. ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
Similar News
News March 25, 2025
గజ్వేల్ అంటే అభిమానం.. అభివృద్ధికి సహకరిస్తా: సీఎం

గజ్వేల్ నియోజకవర్గం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని గజ్వేల్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాదయాత్రగా వెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభకు రాకపోవడంతో నియోజకవర్గ సమస్యలు సభలో ప్రస్తావనకు రావట్లేదని సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈవిషయం తన దగ్గరికి వచ్చిన వీడియోను సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు.
News March 25, 2025
క్షయ వ్యాధి నివారణలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉంది

క్షయ వ్యాధి నివారణలో చికిత్సను అందించడంలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణలో జిల్లా అధికారులు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 మందికి టీబి చికిత్స అందించినట్లు వెల్లడించారు.
News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.