News March 30, 2024
ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి..?

ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్ఠానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ. ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని ఖమ్మం బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రఘురామరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉండటమే కాక మంత్రి పొంగులేటికి వియ్యంకుడు.
Similar News
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
News November 24, 2025
ఖమ్మం: రిజర్వేషన్లు ఖరారు.. కలెక్టర్ గెజిట్ విడుదల

ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, 5214 వార్డుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లలో 260 మహిళలకు.. 311 జనరల్ స్థానాలను కేటాయించారు. అలాగే 5,214 వార్డుల్లో 2,252 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల నివేదికను నేడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.
News November 24, 2025
ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్కు ఆర్టీసీ డీలక్స్ బస్సు

ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్కు డీలక్స్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


