News August 27, 2024

ఖమ్మం: ఎకరానికి రూ.7,500 ఎప్పుడు?

image

ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద
ఎకరానికి రూ.7,500 చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ఎదురుస్తున్నారు. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని సర్కార్ చూస్తోంది. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

Similar News

News April 16, 2026

ఖమ్మం: ఫైర్‌ సిబ్బందికి ‘విశిష్ట సేవ’ పురస్కారాలు

image

అగ్నిమాపక సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించిన ‘బ్రాంజ్ డిస్క్’, ప్రశంసాపత్రాలను వైరాకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ గద్దె కృష్ణ ప్రసాద్, ఖమ్మంకు చెందిన వాగదాని రాంబాబు అందుకోనున్నారు. రాష్ట్రంలో 10 మందికి ఈ గౌరవం దక్కగా, అందులో జిల్లా నుంచి ఇద్దరు ఉండటం విశేషం.

News April 16, 2026

ఖమ్మం: ఫైర్‌ సిబ్బందికి ‘విశిష్ట సేవ’ పురస్కారాలు

image

అగ్నిమాపక సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించిన ‘బ్రాంజ్ డిస్క్’, ప్రశంసాపత్రాలను వైరాకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ గద్దె కృష్ణ ప్రసాద్, ఖమ్మంకు చెందిన వాగదాని రాంబాబు అందుకోనున్నారు. రాష్ట్రంలో 10 మందికి ఈ గౌరవం దక్కగా, అందులో జిల్లా నుంచి ఇద్దరు ఉండటం విశేషం.

News April 16, 2026

ప్రజాపాలనతో గ్రామాల్లో మార్పు రావాలి: కలెక్టర్ అనుదీప్

image

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో మార్పు తీసుకురావాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కూసుమంచిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు మంజూరైన 16,500 ఇందిరమ్మ ఇళ్లలో 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలని, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.