News March 27, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేది ఎవరు..?

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై నేడు ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు రాత్రి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేసి ప్రకటన చేయనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క ఉన్నారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాగా వీరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కామెంట్ చేయండి.

Similar News

News April 20, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

image

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News April 20, 2025

KU డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News April 20, 2025

ఖమ్మం: ‘సీఎం వస్తేనే పెళ్లి ఖరారు చేసుకుంటా’

image

CM రేవంత్ రెడ్డిని తన పెళ్లికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు యువజన కాంగ్రెస్ నేత భూక్య గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. కారేపల్లి మండలం మేకలతండాకి చెందిన గణేష్ తనకు పెళ్లి కుదిరిందని సీఎం వచ్చిన రోజే తాను పెళ్లి తేదీ ఖరారు చేస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సీఎంకు రావాలని రిక్వెస్ట్ లెటర్ పంపారు. ఈ లెటర్ జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.

error: Content is protected !!