News April 24, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఈయనే..!

image

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Similar News

News October 16, 2025

టీటీడీ ఆలయానికి 20 ఎకరాల గుర్తింపు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వాళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News October 16, 2025

ఖమ్మం: భారంగా మారిన ఇసుక ధరలు.!

image

ఖమ్మం జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.2,000 నుంచి 2,500 పలుకుతోంది. ఒక ఇంటి నిర్మానికి సుమారు 80 టన్నుల ఇసుక అవసరం అయితే దీనికే రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ ప్రాంతంలో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి. COMMENT

News October 16, 2025

KMM: ఆర్థిక సమస్యలు.. యువకుల సూసైడ్ అటెంప్ట్

image

ఎర్రుపాలెం మండలం ములుగుమాడుకి చెందిన స్నేహితులు ఆముదాల రాము, షేక్ జానీ ఆర్థిక సమస్యల కారణంగా బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాము పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. జానీకి మధిరలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.