News April 24, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఈయనే..!
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
Similar News
News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: పొంగులేటి
ప్రాథమిక లిస్టులో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేశవపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఓ పక్క అభివృద్ధితోపాటు మరోపక్క ప్రజలకు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు.
News January 23, 2025
ఖమ్మం: తగ్గిన పత్తి, మిర్చి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.14,250 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ.15,000గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.250, కొత్త మిర్చి రూ.100, పత్తి రూ.100 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
News January 23, 2025
ఖమ్మం: రెండో రోజు 52,829 దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మం జిల్లాలో రెండో రోజు బుధవారం 204 గ్రామసభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల పేర్లు ప్రకటించడంతో పాటు ఎంపికకాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. మొత్తం 52,829 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 18,777, రేషన్ కార్డులకు 17,962, రైతుభరోసా 2,147, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 13,943 దరఖాస్తులు అందాయన్నారు.