News March 21, 2024
ఖమ్మం: కీలక నేత పార్టీ మార్పు..?

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ నామాను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామా పోటీ చేస్తారని టాక్. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అటు నామా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News December 11, 2025
KMM: ‘అయ్యా బాబోయ్.. 10 రోజుల్లో రూ.125 కోట్ల మద్యం తాగేశారు’

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మద్యం, నగదును ప్రధాన హస్తంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గడిచిన పది రోజుల్లో రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17 వరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగా అవకాశం ఉంది.
News December 11, 2025
ఖమ్మం గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

ఖమ్మం జిల్లాలో తొలివిడతలో 7 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బోనకల్(22), చింతకాని(26), కొణిజర్ల(27), మధిర(27), రఘునాథపాలెం(37), వైరా(22), ఎర్రుపాలెం(31) మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుండి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?
News December 11, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


