News April 2, 2025
ఖమ్మం: కేంద్రమంత్రితో రాజ్యసభ ఎంపీలు భేటీ

రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్లో ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.


