News January 30, 2025
ఖమ్మం: కొనుగోళ్ల బంద్.. అన్నదాతల ఆందోళన

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను బుధవారం నుంచి నిలిపివేయడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు చెబుతున్నారు. సుమారు 5,000 క్వింటాల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉందని వారు అంటున్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News February 20, 2025
మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం:కలెక్టర్

ఖమ్మం : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 19, 2025
ఖమ్మం: వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్

ఖమ్మం: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, గత సంవత్సరం దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు.
News February 19, 2025
ఖమ్మం జిల్లా TOP NEWS

✓ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య✓జిల్లా వ్యాప్తంగా ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు✓ఖమ్మం: బెట్టింగ్ భూతానికి యువకుడు బలి✓ తిరుమలాయపాలెంలో ఎరువులు కొరత✓పెనుబల్లి:వ్యక్తిని ఢీకొట్టిన టీవీఎస్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి✓ పెరుగుతున్న ఎండలు.. కలెక్టర్ రివ్యూ ✓ఖమ్మం: ముగ్గురు మంత్రులు ఉండి రైతులను పట్టించుకోరా:MLC ✓ఏన్కూర్ మండల ప్రజలకు GOODNEWS✓ పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి తుమ్మల