News November 16, 2024

ఖమ్మం: గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సువర్ణ పురం గ్రామానికి చెందిన వేల్పుల భార్గవి(16) మండల కేంద్రంలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతుంది. కాగా శుక్రవారం రాత్రి భార్గవి గడ్డి మందు తాగడంతో తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, శనివారం మృతి చెందింది. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 4, 2025

ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

image

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు

News December 4, 2025

ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

image

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు