News August 24, 2024

ఖమ్మం: గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘురామిరెడ్డి

image

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపం గురించి వివరించారు.

Similar News

News October 30, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

image

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News October 30, 2025

విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

image

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 29, 2025

అత్యవసరమైతే 1077కు కాల్ చేయండి: ఖమ్మం కలెక్టర్

image

‘మొంథా’ తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. వరదలు, ప్రమాదాల సమయంలో వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 లేదా 90632 11298కు కాల్ చేయవచ్చని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.