News April 24, 2024

ఖమ్మం: గుండెపోటుతో అడ్వకేట్ మృతి

image

పెనుబల్లి మండలం వియం బంజర గ్రామానికి చెందిన అడ్వకేట్ పీవీ భాస్కర్ గుండెపోటుతో మృతి చెందారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తపది వారు మృతుడి నేత్రాలను సేకరించి నేత్రదాన నిధికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ అబ్దుల్ సలాం, కార్యదర్శి సుంకర సత్యనారాయణ, అధ్యక్షుడు కోట్లు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

image

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 22, 2025

ఖమ్మం: రెండు పదవులకు 66 మంది పోటీ

image

ఖమ్మం కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవుల ఎంపికపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీకి 56, నగర కమిటీకి 10 మంది దరఖాస్తు చేసుకోగా, ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐదేళ్లుగా కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యనేతల బంధువులు అర్హులు కాదన్న నిబంధనతో వడపోత పూర్తయి, నవంబర్ 15న తుది జాబితా వెలువడనుంది.

News October 22, 2025

ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

image

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.