News May 19, 2024

ఖమ్మం: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి 27,475 మంది

image

జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్‌ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ తెలిపారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.