News May 19, 2024

ఖమ్మం: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి 27,475 మంది

image

జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్‌ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ తెలిపారు.

Similar News

News February 24, 2026

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

image

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

News February 24, 2026

ఖమ్మం: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థలాల కేటాయింపు

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సూర్యాపేట‌, వికారాబాద్‌, మెద‌క్‌, నిజామాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.

News February 24, 2026

ఖమ్మం: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థలాల కేటాయింపు

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సూర్యాపేట‌, వికారాబాద్‌, మెద‌క్‌, నిజామాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.