News March 30, 2024
ఖమ్మం జిల్లాలో అడుగంటిన జలాశయాలు

ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు వట్టిపోయాయి. ప్రధాన రిజర్వాయర్లైన పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్లో నీరు అడుగంటింది. మిగతా చిన్నాపెద్ద చెరువుల్లో కూడా నీళ్లు అడుగంటడంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణం నెలకొంది. బోర్లు, బావుల్లో నీళ్లు లేక సాగు చేసిన పంటలు పలు ప్రాంతాల్లో ఎండిపోయాయి. మరో మూడు, నాలుగు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 27, 2025
ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.


