News March 17, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!

∆}ఖమ్మం నగరంలో సినీ హీరో సుమన్ సందడి∆}రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష∆} తిరుమలాయపాలెం:పురుగుమందు నీళ్లు తాగి వ్యక్తి మృతి∆} సత్తుపల్లి:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు∆} బోనకల్:అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య∆} ఖమ్మం: కారులో మంత్రి పొంగులేటి షి’కారు’∆} ఖమ్మం: అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి తుమ్మల∆}ఖమ్మంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం
Similar News
News October 15, 2025
రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు: ఖమ్మం CP

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. పోలీసుల సేవలు, త్యాగాలు, కీర్తి ప్రతిష్ఠలను ప్రతిబింబించే అంశాలపై ఫోటోలు, షార్ట్ ఫిల్మ్లను ఈ నెల 22వ తేదీలోపు పీఆర్వో నంబర్ 87126 59256కు పంపాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
News October 15, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్లతో అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని ఆదేశించారు.
News October 15, 2025
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.