News March 10, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓ సింగరేణి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ✓ఖమ్మం: సేంద్రీయ సాగుపై మంత్రి తుమ్మల సంతృప్తి ✓ వనంవారి కిష్టాపురం వద్ద కారు బోల్తా.. స్వల్ప గాయాలు ✓ కూసుమంచి: సోదరుల మధ్య ఘర్షణ.. అన్న తలకు గాయం ✓ మన ఖమ్మం జిల్లాకు రూ.1,400 కోట్లు ✓ చింతకాని : యువతి అదృశ్యం.. కేసు నమోదు ✓ చింతకాని: లింగనిర్ధారణ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.
Similar News
News March 10, 2025
సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News March 10, 2025
ఖమ్మం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.