News April 26, 2024
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 83,600

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు వేగం పెంచనున్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా జిల్లాలోని 21 మండలాల పరిధిలో 83,600 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 50,513, మహిళలు 33,083, ఇతరులు నలుగురు ఉన్నారు.
Similar News
News January 8, 2026
ఖమ్మం మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా..!

ఖమ్మం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారి శ్వేత గురువారం విడుదల చేశారు. టమాట కేజీ రూ. 34, వంకాయ 20, గుత్తి వంకాయ 40, బెండకాయ 60, పచ్చిమిర్చి 38, కాకరకాయ 56 కంచ కాకరకాయ 60, బోడ కాకరకాయ 140, బీరకాయ 46, పొట్లకాయ 40, దొండకాయ 56, నాటు దోసకాయ 50, బుడం దోసకాయ 60, చిక్కుడు 20, నాటు చిక్కుడు 40, ఆలుగడ్డ 22, చామగడ్డ 28, ఆకుకూరలు 20కి ఐదు కట్టల చొప్పున ఇస్తున్నారు.
News January 8, 2026
సత్తుపల్లి జిల్లాపై మళ్ళీ చర్చ.. నెరవేరేనా ప్రియాంక గాంధీ హామీ?

సత్తుపల్లి జిల్లా హామీపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ‘నచ్చిన వారికి జిల్లాలు’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు పడతాయా? లేక రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సత్తుపల్లి ఆశలు మళ్లీ చిగురించాయి.
News January 8, 2026
ఖమ్మం: పదో తరగతి విద్యార్థులకు ‘స్నాక్స్’.. నిధులు విడుదల!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్నాక్స్ ఖర్చుల నిమిత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 25.45 లక్షల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించనున్నారు.


