News January 26, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పథకాలు ప్రారంభం
∆} జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
Similar News
News February 7, 2025
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండాలపాడుకి చెందిన గోపీచంద్ తాను 7ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తి వివాహమైందని బాధితురాలు తెలిపింది. భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చానట్లు వెల్లడించింది. తీరా వచ్చిన తరువాత గోపిచంద్ ముఖం చాటేస్తున్నాడని అవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది
News February 7, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 70 వేల బస్తాలు..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్కు రావడంతో షెడ్లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెటకు వచ్చింది.
News February 7, 2025
కమర్షియల్ షాపులకు ఆన్లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్కు దరఖాస్తు చేసుకువాలన్నారు.