News March 12, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన∆} ∆} పర్ణశాలలో ప్రత్యేక పూజలు
Similar News
News December 6, 2025
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలలో పనిచేసే ఓటర్లకు సౌకర్యం కల్పించామని చెప్పారు. దీనికోసం పోస్టల్ ఓటింగ్ సెంటర్/ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధిత మండలాల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు.
News December 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
News December 6, 2025
మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.


