News January 30, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు ∆} సత్తుపల్లిలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ∆} వేంసూరులో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
Similar News
News February 8, 2025
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 7, 2025
ఖమ్మం: రుణ మంజూరులో వెనుకంజ..!

ఖమ్మం జిల్లా స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరు ప్రక్రియలో వెనుకంజలో ఉంది. మొత్తం 21,348 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,113.32 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్, జనవరికల్లా ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. కానీ ఫిబ్రవరి మొదటి వారం దాటుతున్నా 7,774 సంఘాలకు రూ.738.79 కోట్ల (66.36 శాతం) మేర మాత్రమే రుణం అందించగలిగారు.
News February 7, 2025
ఖమ్మం: వినూత్న ప్రయోగం.. విద్యార్థులకు కలెక్టర్ లేఖ

పదో తరగతి ఫలితాల్లో 100% సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ధైర్యంగా హాజరయ్యేలా సిద్ధం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సదస్సుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరు కాగా మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతీ విద్యార్థికి తన సంతకంతో కూడిన లేఖ అందించాలని ఆయన నిర్ణయించారు. ఈవిషయమై డీఈవో ఉద్యోగులతో లేఖ తయారీపై సమీక్షించారు.