News April 13, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

1) ఖమ్మం: నేడు పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు 2) మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన 3) వల్లభిలో అంబేద్కర్ విగ్రహావిష్కరించనున్న మందకృష్ణ మాదిగ 4) కూసుమంచిలో మంత్రి పొంగులేటి పర్యటన 5) ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు 6) ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం 7) ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన 8) బేతుపల్లి అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు.

Similar News

News October 14, 2025

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు.

News October 14, 2025

తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.