News May 29, 2024
ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ మిస్టరీ
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క మృతిచెందారు. అయితే కారు డ్రైవ్ చేస్తున్న కుమారి భర్త బోడా ప్రవీణ్కు గాయాలయ్యాయి. అయితే మృతులపై ఒంటిపై గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో తల్లి, పిల్లల మృతదేహాలున్నాయి.
Similar News
News September 29, 2024
HYDలో మధిర మండల వాసి మృతి
మధిర మండలం రాయపట్నంకి చెందిన కంపసాటి కొండ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతణ్ని హైదరాబాదుకు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజ మరణమా లేదా ఇతర కారణమా తెలియాల్సి ఉంది.
News September 29, 2024
పంచాయతీ ఎన్నికలు.. మహిళా ఓటర్లు ఎంతమందంటే.
ఖమ్మం జిల్లాలో మహిళా ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. . ఖమ్మం (R) 40,807, తిరుమలాయపాలెం 25,705, కూసుమంచి 25,528, నేలకొండపల్లి 25,633,ముదిగొండ 25,026, రఘునాథపాలెం 20,954, కొణిజర్ల 21,176, వైరా13,909, చింతకాని 21,340, ఏన్కూర్ 14,340, కల్లూరు 27,473,తల్లాడ 23,336, పెనుబల్లి 22,086,సత్తుపల్లి 18,329, మధిర 16,084, బోనకల్ 18,455, ఎర్రుపాలెం 20,407,వేంసూరు 18,579, కామేపల్లి 17,779, సింగరేణి 22,862.
News September 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
∆} భద్రాచలంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
∆} తల్లాడ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే డా”రాగమయి దయానంద్ పర్యటన
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు పర్యటన