News April 4, 2025
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో KCR సమావేశం..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్లో శనివారం ఉ. 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, జనసమీకరణ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హజరుకానునన్నట్లు సమాచారం.
Similar News
News February 26, 2026
‘టాక్సిక్’ రన్టైమ్ షాక్.. 2 పార్ట్లుగా రానుందా?

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ రన్టైమ్పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ భారీ గ్యాంగ్స్టర్ డ్రామా నిడివి కేవలం 2:20 గంటలేనన్న టాక్ నడుస్తోంది. ఇంత తక్కువ టైమ్లో భారీ కథను చూపించడం కష్టమని అందుకే రెండు పార్ట్లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ రన్టైమ్ నిజంగా తక్కువే ఉంటే ‘టాక్సిక్ 2’ పక్కా అని SMలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News February 26, 2026
గురువార వ్రత కథ

దయావంతుడనే ధనవంతుడు దానధర్మాలు చేసేవాడు. భార్యకు ఇవేం ఇష్టం లేదు. ఓరోజు బృహస్పతి సాధువుగా వచ్చి భిక్ష అడిగాడు. ఆమె సంపదంతా పోయి ప్రశాంతంగా ఉండాలని కోరింది. సాధువు చెప్పినట్లు ఆమె ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి, దరిద్రం అనుభవించింది. ఆ తర్వాత పొరుగున ఉన్న పుణ్యస్త్రీ సలహాతో తన తప్పు తెలుసుకుని ఈ వ్రతం చేసింది. దీంతో బృహస్పతి ప్రసన్నుడై వారికి తిరిగి ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.
News February 26, 2026
AI వల్ల ఆదాయం తగ్గినా ఓకే: TCS CEO

AI వల్ల కంపెనీ ఆదాయం తగ్గినా పర్లేదని TCS CEO కృతివాసన్ స్పష్టం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం తమకు లేదని, పైగా తమ 6 లక్షల మంది ఉద్యోగులు ఇందులో నైపుణ్యం సాధించాలని ఆదేశించారు. సీనియర్ల కంటే జూనియర్లే దీన్ని వేగంగా ఒంటబట్టించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. AIని కేవలం వాడుకోవడం కాకుండా కొత్త సొల్యూషన్స్ బిల్డ్ చేయాలని ఉద్యోగులకు సూచించారు.


