News April 4, 2025

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో KCR సమావేశం..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో శనివారం ఉ. 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, జనసమీకరణ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హజరుకానునన్నట్లు సమాచారం.

Similar News

News April 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 20, 2025

KMR: స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి యువకుడి మృతి

image

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం వెళ్లిన నగేష్ అనే యువకుడు సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగేష్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.

News April 20, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

image

రైతుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!