News July 23, 2024
ఖమ్మం: జ్వరంతో LKG బాలుడు మృతి

తిరుమలాయపాలెం గ్రామంలో జ్వరం వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామస్థుడు గొలుసు ఉమేశ్ కొడుకు అక్షిత్(6) LKG చదువుతున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడికి ఒక్కసారిగా జ్వరం సోకింది. ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News February 27, 2026
ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
News February 27, 2026
BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
News February 27, 2026
సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.


