News July 23, 2024
ఖమ్మం: జ్వరంతో LKG బాలుడు మృతి
తిరుమలాయపాలెం గ్రామంలో జ్వరం వచ్చి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామస్థుడు గొలుసు ఉమేశ్ కొడుకు అక్షిత్(6) LKG చదువుతున్నాడు. సోమవారం ఉదయం దాకా ఆడుకున్న బాలుడికి ఒక్కసారిగా జ్వరం సోకింది. ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 9, 2024
రేపు దద్దరిల్లనున్న ఖమ్మం
సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్తాబైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 9, 2024
బతుకమ్మ పూల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి
అశ్వాపురం మండలం జగ్గారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నున్న ఐలయ్య బతుకమ్మ పండుగ పూల కోసంకోసం గ్రామ పరిధిలో ఉన్న ఊర చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నున్న ఐలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐలయ్య మణుగూరు సురక్ష బస్టాండ్లో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
News October 9, 2024
దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు
దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.