News March 2, 2025

ఖమ్మం: ట్రాక్టర్‌ కిందపడి ఆరేళ్ల బాలుడి మృతి

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్‌పురంలో విషాదం నెలకొంది. నల్లగట్టు ఉపేందర్ దంపతుల కుమారుడు రోహిత్(6), ట్రాక్టర్ మీద ఆడుకుంటుండగా, ఇంజన్‌కు ఉన్న తాళం తిప్పడంతో సడన్‌గా ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదిలింది. దీంతో భయంతో ట్రాక్టర్ నుంచి కిందకు దూకడంతో ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడి తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Similar News

News March 22, 2025

6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

image

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.

News March 22, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పది పరీక్షలు.

News March 22, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు ఖమ్మం బిడ్డ సిరి

image

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025 రాష్ట్రస్థాయి పోటీలకు జేవియర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దాసరి సిరి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. కళాశాలతో పాటు మండల, జిల్లా స్థాయుల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు దాసరి సిరికి అభినందనలు తెలిపారు.

error: Content is protected !!