News August 13, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. స్థిరంగా ఉన్న పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News November 21, 2025

ఖమ్మం: ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

image

ఖమ్మం జిల్లాలోని అనేక ఆర్వో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పరిశుభ్రత పాటించకపోవడంతో నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. అధికారుల నిఘా లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 21, 2025

ఖమ్మంలో రేపు జాబ్‌ మేళా.. నిరుద్యోగులకు అవకాశం

image

ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన కోసం టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో(శనివారం) జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. SSC నుంచి డిగ్రీ వరకు అర్హత ఉండి, 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు. మారుతి ఆగ్రో అండ్‌ ఫర్టిలైజర్స్‌ కంపెనీ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని చెప్పారు. వివరాలకు 96667 10273ను సంప్రదించాలి.

News November 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో నేడు అందెశ్రీ సంస్మరణ కార్యక్రమం
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం: పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన