News February 20, 2025

ఖమ్మం: తహశీల్దార్ ఆఫీస్ ఎదుట వృద్ధురాలి ఆవేదన

image

ఖమ్మం జిల్లా మధిర తహశీల్దార్ కార్యాలయం ఎదుట దెందుకూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కనకపూడి కరుణమ్మ(85) ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ‘ఆక్రమణకు గురైన నా స్థలామైనా ఇప్పించండి.. లేదా నేను చనిపోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అని రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆఫీస్ ముందు బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. తన స్థలం కోసం తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయానన్నారు. మల్లు నందిని అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు.

Similar News

News December 4, 2025

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.

News December 4, 2025

ADB: రోడ్లే దిక్కులేవంటే.. ఎయిర్ పోర్టు ఎందుకు.?

image

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్లు లేక ఆదివాసీ బిడ్డలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నవంబర్ నెలలో రోడ్లు లేక ముగ్గురు గర్భిణులు ప్రాణాలు విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఎయిర్ పోర్టు తెచ్చి ఆదివాసీలను ఫ్లైట్స్‌లో తరలిస్తారా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.