News December 15, 2024
ఖమ్మం: దుబాయ్ పారిపోయిన వ్యక్తి అరెస్ట్
మైనర్ బాలికను వేధించిన ఖమ్మం(D) పోలేపల్లికి చెందిన యలమల్ల సతీష్ని LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మన్సూరాబాద్లో అక్క, బావ వద్ద ఉంటూ అదే కాలనీలో మైనర్ బాలికను వెంటపడుతూ, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించేవాడు. రాత్రుల్లో ఆమెని పిలుస్తూ ఇబ్బంది పెట్టేవాడు. అక్టోబర్లో కేసు నమోదవగా నిందితుడు దుబాయ్ పారిపోయాడు. వారం క్రితం వచ్చిన అతన్ని విచారించి రిమాండ్కు పంపామని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
Similar News
News January 22, 2025
KMM: పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ
ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలను సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News January 21, 2025
ఖమ్మం: గ్రామసభ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతలకు సమస్య తలెత్తకుండా ఏర్పాటుచేసిన బందోబస్తును సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. ఖమ్మం మంచుకొండ, మధిర నాగులవంచ, పాలేరు మద్దులపల్లి గ్రామ సభలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News January 21, 2025
‘కన్న కూతురిని చంపబోయాడు’
కన్న కూతురిని తండ్రి కడతేర్చాలని చూసిన ఘటన ఈ నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. టేకులపల్లి మం. సంపత్ నగర్కు చెందిన కొర్స రవి-లక్ష్మి దంపతులు. రవి భార్యతో గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతను కూతురికి చాక్లెట్స్ కొనిస్తానని పక్కనే ఉన్న జామాయిల్లోకి తీసుకెళ్లి చంపబోయాడు. ఇంటికి వచ్చి బాలిక విషయం తల్లికి చెప్పడంతో అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.