News January 17, 2026
ఖమ్మం: నగారా మోగకముందే.. ‘సర్వే’ సందడి!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికల నగారా మోగకముందే పలు సర్వే సంస్థలు రంగప్రవేశం చేసి ఆశావాహులను చుట్టుముడుతున్నాయి. ‘ఓటర్ల నాడి మాకు తెలుసు’ అంటూ నమ్మబలుకుతున్నాయి. పార్టీ టికెట్ల వేటలో ఉన్న అభ్యర్థులకు ఈనివేదికలు ఆయుధాలుగా మారుతాయని ఆశ చూపుతున్నాయి. మరోవైపు జిల్లా యంత్రాంగం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కసరత్తును వేగవంతం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
Similar News
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: ఖమ్మం సీపీ

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రస్తుతం BNSS 163 అమలులో ఉన్నందున.. విజయోత్సవ వేడుకలు, బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, డీజేల వాడకంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమించి గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని సీపీ కోరారు.
News February 13, 2026
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.
News February 13, 2026
ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.


