News October 16, 2024
ఖమ్మం: నిద్రిస్తున్న కుమారుడిని హత్య చేసిన తండ్రి

ఖమ్మంలో దారుణం జరిగింది. 60వ డివిజన్ రామన్నపేట కాలనీకి చెందిన కొంపల్లి గణేశ్(30)ని అతని తండ్రి హత్య చేశాడు. స్థానికుల వివరాలిలా.. కాలనీకి చెందిన కొంపల్లి వెంకటేశ్వర్లు మద్యానికి బానిసయ్యాడు. తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం తన కుమారుడు గణేశ్ నిద్రిస్తుండగా గొడ్డలితో హత్య చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
ఖమ్మం: తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్టును గురువారం మండలాల వారీగా జిల్లా అధికారులు విడుదల చేశారు. ఏడు మండలాల్లో కలిపి 192 సర్పంచి స్థానాలకు 476, 1,740 వార్డుల స్థానాలకు 3,275 మంది పోటీ పడుతున్నారు. కొణిజర్ల S-73 W-524, రఘునాథపాలెం S-106 W-589, వైరా S-50 W-348, బోనకల్ S-46 W-414, చింతకాని S-64 W-466, మధిర S-67 W-468, ఎర్రుపాలెం S-70 W-466 ఖరారయ్యారు.
News December 4, 2025
ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం తనీఖీ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.
News December 4, 2025
రఘునాథపాలెం: ప్రజాస్వామ్యంలోకి ఎన్నికలు అత్యంత కీలకం: DCP

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలంలో ఎన్నికలకు నామినేషన్ వేసిన సర్పంచులు, వార్డ్ సభ్యుల అభ్యర్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, స్థానిక ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.


