News February 17, 2025

ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు బస్సులు

image

 సూర్యాపేట పెద్దగట్టు జాతర నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర  ఐదు రోజులపాటు కొనసాగునుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. భక్తులు ప్రయాణం సౌకర్యార్థం ఈ జాతరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. 

Similar News

News March 13, 2025

భద్రాచలం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.

News March 13, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు’

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం

News March 13, 2025

ఖమ్మం: MSG ఓపెన్ చేస్తే రూ.మూడున్నర లక్షలు మాయం

image

సైబర్ మోసగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.3.50 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుసులూరి ఉపేందర్ చౌదరి వరి కోత మెషీన్ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 2 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా పీఎం కిసాన్ యాప్ అని మెసేజ్ రాగా, దానిని ఓపెన్ చేయడంతో మంగళవారం రూ.3.50 లక్షలు అకౌంట్ నుంచి బదిలీ అయ్యాయని బాధితుడు వాపోయాడు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

error: Content is protected !!