News April 13, 2025
ఖమ్మం: నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
Similar News
News December 22, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 22, 2025
ఖమ్మం: 290 మంది కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 1,339 మంది ఆశా కార్యకర్తలు 50 వేల ఇళ్లను సందర్శించి 1.61లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటివరకు 290 మంది అనుమానితులను గుర్తించినట్లు DMHO డాక్టర్ రామారావు తెలిపారు. వీరికి తుది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.. లక్షణాలుంటే భయం వీడి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
News December 22, 2025
ఖమ్మం జిల్లా రైతులకు రూ.68 కోట్ల బోనస్ జమ

ఖమ్మం జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 22,000 మంది రైతులకు రూ.68.34 కోట్లు చెల్లించారు. ఇంకా 11,900 మందికి రూ.34.06 కోట్లు అందాల్సి ఉంది. అత్యధికంగా కల్లూరు మండలంలో రూ.20.28 కోట్లు, వేంసూరులో రూ.8.87 కోట్లు జమ చేశారు. మిగిలిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.


