News April 13, 2025

ఖమ్మం: నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

image

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.

Similar News

News October 17, 2025

కేయూ రిజిస్ట్రార్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

image

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్‌‌ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

News October 17, 2025

MNCL: చిరు వ్యాపారులకు చేయూత

image

చిరు, వీధి విక్రయదారులకు బ్యాంక్ రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. లోక కళ్యాణం పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా అధికారులు వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 29000 మంది వ్యాపారులకు రూ.45 కోట్లకు పైగా రుణాలను అధికారులు అందజేశారు.

News October 17, 2025

కరీంనగర్: గ్రేడ్ A రకానికి రూ.2,389/-

image

2025-26 వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్‌లో 9.24 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ నేపథ్యంలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,304 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. గ్రేడ్ A రకం వడ్లకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369లను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది.