News January 8, 2025

ఖమ్మం: పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI వివరాల ప్రకారం.. KMM జిల్లా కామేపల్లి మండలం రేపల్లేవాడకు చెందిన నెహ్రూ(23) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కాగా, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 3న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

image

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.

News October 22, 2025

ఖమ్మం: 200 ఉద్యోగాలు.. రేపే అవకాశం

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జె.వి.జి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హత గల 19-23 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావాలని సూచించారు.

News October 22, 2025

సర్వేలో పాలుపంచుకోండి: కలెక్టర్‌ అనుదీప్‌

image

రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనకై ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌–2047’ సిటిజన్‌ సర్వేలో ప్రతి పౌరుడు పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పిలుపునిచ్చారు. ప్రజల నుంచి సూచనలు సేకరించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 25తో సర్వే ముగుస్తుందని, అర్హులైన పౌరులు తమ సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆయన కోరారు.