News February 21, 2025
ఖమ్మం: పోక్సో కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 2021 FEB 7న ఇంటి బయట ఆడుకుంటుండగా సంపత్, నవీన్లు మాయమాటలు చెప్పి బైక్పై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కేసు విచారణ అనంతరం నిందితులకు జైలు శిక్ష విధించారు.
Similar News
News October 19, 2025
ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.
News October 19, 2025
ఖమ్మం: సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 5 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5లోగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.
News October 18, 2025
డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.