News February 20, 2025
ఖమ్మం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఖమ్మం జిల్లా కారేపల్లి PSలో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ రాజారాం తెలిపిన వివరాలు.. భాగ్యనగర్ తండాకు చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల యువకుడు ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పడంతోపాటు అతడి ఆరుగురి ఫ్రెండ్స్తో కలిసి యువతి ఇంటి వద్ద గొడవ చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడితోపాటు, అతడి ఫ్రెండ్స్పై కేసు నమోదు చేశారు.
Similar News
News March 26, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
News March 26, 2025
ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో నగదు

రైతుభరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది.
News March 26, 2025
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.