News June 29, 2024

ఖమ్మం: బావిలో పడ్డ ట్రాక్టర్, దంపతులకు తీవ్రగాయాలు

image

నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్‌ను ట్రాక్టర్‌తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్‌తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.

Similar News

News October 27, 2025

ఖమ్మం: నేడే లక్కీ డ్రా.. తీవ్ర ఉత్కంఠ..!

image

ఖమ్మం జిల్లాలో 2025-27 మద్యం పాలసీకి సంబంధించిన 122 దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ డ్రాను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్, లకారం రిక్రియేషన్ జోన్ వద్ద తీయనున్నారు. ఈ 122 దుకాణాల కోసం 4,430 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.132.90 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో వైన్స్ టెండర్ ఎవరికి దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News October 26, 2025

ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

image

HYDలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.

News October 26, 2025

ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

image

HYDలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.