News March 24, 2024
ఖమ్మం: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

గాంధీనగర్ కాలనీ వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని వత్సవాయికి చెందిన గుర్రం శేషగిరిరావు బైక్పై ఖమ్మం నుంచి వత్సవాయికి వెళ్తున్నాడు. అదే సమయాన బోనకల్ మండలం మోటమర్రి చెందిన వెంకటరావు ఖమ్మం వైపు వెళుతుండగా గాంధీనగర్ కాలనీ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శేషగిరిరావు మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్కు ఆర్టీసీ డీలక్స్ బస్సు

ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్కు డీలక్స్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 24, 2025
ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్కు ఆర్టీసీ డీలక్స్ బస్సు

ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్కు డీలక్స్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 23, 2025
ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.


