News July 23, 2024
ఖమ్మం: బొగత జలపాతంలో యువకుడి మృతి

వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు జశ్వంత్(19) కొలనులో గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి మృతదేహాన్నీ సాయంత్రం వెలికి తీశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.
News November 27, 2025
ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.


