News January 5, 2025

ఖమ్మం మంత్రులకు కూనంనేని కృతజ్ఞతలు

image

పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.

Similar News

News October 25, 2025

సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

image

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.

News October 25, 2025

పది విద్యార్థులు 30లోగా ఫీజు చెల్లించండి: ఇన్‌ఛార్జ్ డీఈవో

image

2026 మార్చిలో నిర్వహించే పరీక్షలకు హాజరు కానున్న పదోతరగతి, ఒకేషనల్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇన్‌ఛార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. రూ.50 పైన్‌తో నవంబరు 15, రూ.200ల ఆలస్య రుసుంతో డిసెంబరు 2, రూ.500 పైన్‌తో డిసెంబరు 15 లోగా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

News October 25, 2025

మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ. 2,400: కలెక్టర్

image

2025-26 మార్కెటింగ్ సీజన్‌లో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 కనీస మద్దతు ధరను ప్రకటించిందని, ఈ ధరకు కొనుగోలుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 1,705 ఎకరాల సాగవుతుందన్నారు. 5,456 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.